శ్రీకాకుళం రూరల్ః పెదపాడులోని ధర్మాన క్యాంపు కార్యాలయంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రోశయ్య చిత్రపటానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రోశయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కళింగవైశ్య అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పా ర్టీ నాయకులు అంబటి శ్రీనివాసరావు, ఎన్ని ధనుంజయరావు, మండవల్లి రవికుమార్, తంగుడు నాగేశ్వరరావు, కోణార్క్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


