అంతర్ పాలిటెక్నిక్ క్రీడల్లో ప్రతిభ
ఎచ్చెర్ల : గత నెల 28, 29, 30వ తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. జావెలిన్త్రోలో ప్రథమ, బ్యాడ్మింటన్ సింగిల్స్, హైజంప్, 400 మీటర్ల పరుగు, 4/100 మీటర్లు రిలేలో తృతీయ స్థానాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్ కె.నారాయణరావు శనివారం అభినందించారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు జి.దామోదరావు, బి.తులసిరావు, ఎ.శివప్రకాశరావు, డి.మురళీకృష్ణ, రామాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


