కమ్మసిగడాంలో కల్యాణ రాట
రణస్థలం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కమ్మసిగడాంలోని మహాలక్ష్మీ అమ్మవారి జాతర సందర్భంగా ఆదివారం ఆలయం వద్ద కల్యాణరాట వేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ మహాలక్ష్మీ తల్లి, గురప్పదొరల కల్యాణం ఈ నెల 27న రాత్రి 10.16 గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం జాతర మొదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం రూరల్/శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం తహశీల్దార్ ఎస్.గణపతిరావుకు ఆదివా రం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విజయవాడలోని స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఓటరు సవరణలో భాగంగా ఉత్తమ సేవలు అందించినందుకు శ్రీకాకుళం జిల్లా ఎంపిక చేయడం పట్ల జిల్లా ఉన్నతాధికారులు గణపతిరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
కమ్మసిగడాంలో కల్యాణ రాట


