
శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉంచాలి
పాతపట్నం నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎల్ఎన్పేట మండలాన్ని శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉంచాలని, పలాస జిల్లాకు పంపించవద్దని ఆ మండలంలోని పలు గ్రామాలకి చెందిన ప్రజలు పీజీఆర్ఎస్లో కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఎల్ఎన్పేట మండలం చాలాకాలం పాటు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో ఉండేదని, రెవెన్యూ డివిజన్ల విభజనలో ఈ మండలం పాతపట్నం నియోజవకవర్గంతో పాటు టెక్కలి డివిజన్ మార్చారని గుర్తు చేశారు. దీనివలన టెక్కలికి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, అత్యంత సమీపంలో ఉండే శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని విన్నవించారు. ఈ మేరకు పలు పంచాయతీలు తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు.