ఎస్పీ గ్రీవెన్సుకు 43 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

ఎస్పీ గ్రీవెన్సుకు 43 ఫిర్యాదులు

Aug 12 2025 11:17 AM | Updated on Aug 12 2025 11:17 AM

ఎస్పీ గ్రీవెన్సుకు 43 ఫిర్యాదులు

ఎస్పీ గ్రీవెన్సుకు 43 ఫిర్యాదులు

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 43 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్‌ కాల్‌ ద్వారా తక్షణమే తెలియజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, వాటిపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్‌ కార్యాలయానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement