98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం

May 20 2025 1:02 AM | Updated on May 20 2025 1:02 AM

98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం

98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం

కాశీబుగ్గ: పలాస మండలం పెదంచల పంచాయతీ మరదరాజపురం గ్రామానికి చెందిన 98 ఏళ్ల వృద్ధుడు నర్సింగ పండా (98) కనిపించడం లేదని కుమారుడు జగన్నాథ పండా సోమవారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్న నర్సింగ పండా షుగర్‌ బాధపడుతున్నారు. సమయానికి భోజనం పెట్టలేదని భార్య జయంతి పండాపై కోపంతో ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. పరిసర ప్రాంతాలు, బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు తెలిస్తే 94937 90587 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement