కదిరి అర్బన్: అన్నమయ్య జిల్లా రాయచోటిలో డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి అబ్దుల్ ఖయ్యూమ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు వంద మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్, పీజీ చదివిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7989888299, 9676706976 నంబర్కు సంప్రదించాలని కోరారు.
4న సర్టిఫికెట్ల పరిశీలన
లేపాక్షి: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ కోసం ఆన్లైన్లో ఈ నెల 1 నుంచి 15 వరకూ దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల సర్టిఫికెట్లను కర్నూలు ఆర్టీసీ కార్యాలయంలో డిసెంబరు 4న పరిశీలిస్తారని జిల్లా ఐటీఐ కన్వీనర్ రాయపురెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట కార్యక్రమం సాగుతుందన్నారు. డీజిల్ మెకానిక్, మోటర్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్లలో దరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలని కోరారు.
ఇంట్లో చోరీ
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఉమామహేశ్వరనగర్కు చెందిన రోషమ్మ ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగు చూసింది. ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి చొరబడిన దుండ గులు బీరువాలోని అర తులం బంగారు కమ్మలు, రూ.40 వేలు నగదు అపహరించుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు.