● పంటపాళెంలోని
పామాయిల్ ఫ్యాక్టరీలో ఘటన
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెంలో గల పామాయిల్ ఫ్యాక్టరీలో గురువారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నిర్మాణంలో ఉన్న బాయిలర్ సెక్షన్లో ప్రమాదవశాత్తూ డ్రమ్ములు అదుపు తప్పి ఇద్దరు కార్మికులపై పడ్డాయి. వీరి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి కార్మికులు క్షతగాత్రులను ఆటోలో తరలించసాగారు. మార్గమధ్యలో 108 ఎదురొచ్చి వీరిని నెల్లూరు తరలించారు. ఘటనపై ఫ్యాక్టరీ యాజ మాన్యం స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


