దేవాలయాలు, విద్యాలయాలకు అత్యంత సమీపంలో ఉన్న మద్యం షాపులు, బార్లను వేరే ప్రాంతాలకు తరలించాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, మైనారిటీ, సేవాదళ్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. సేవాదళ్ అధ్యక్షుడు కొండా అనిల్కుమార్ మాట్లాడుతూ మద్యం, మాదకద్రవ్యాల కారణంగా యువతపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. బెల్ట్ షాపులు, నైట్ సేల్స్ను అరికట్టాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షుడు సిరివెల్ల నరేష్ మాట్లాడుతూ సంజయ్ గాంధీ నగర్లోని గ్రీన్ పార్క్ బార్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నేతలు షేక్ నవీద్బాషా, పఠాన్ సైఫ్ అలీఖాన్, షేక్ ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.


