సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 129లో ఉన్న 12.00 హెక్టార్ల మేత పోరంబోకు భూమిని ఏ మినరల్స్ సంస్థకు క్వార్ట్ ్జ మైనింగ్ కోసం మంజూరు చేసిన లీజును పునః పరిశీలించాలని ప్రజలు జేసీకి వినతిపత్రం సమర్పించారు. లీజు మంజూరు చేసే సమయంలో ప్రజల అభిప్రాయాలు, ప్రజా ప్రయోజనాలు, స్థానిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. న్యాయస్థానంలో విషయం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, మైనింగ్ రికార్డులను పరిశీలించాలని కోరారు.


