
భలే కేటుగాళ్లు
తిరుపతి క్రైమ్: సెల్ఫోన్లు చోరీ చేసి అందులోని బ్యాంక్ ఖాతా నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కాసిరెడ్డి ముఠాగా ఏర్పడి నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవారు. వాటిలో ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడ వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమీషన్ కూడా ఇస్తామని నమ్మిస్తారు. ఇలా చెప్పి వీరంతా రూ.3.6 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై హేమాద్రి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
సెల్ఫోన్లు చోరీ చేసి బ్యాంక్ ఖాతాల్లో నగదు హాంఫట్
ముగ్గురి అరెస్ట్
నిందితులు హైదరాబాద్,
అన్నమయ్య జిల్లా,
నెల్లూరు వాసులు