
సర్వేపల్లి కాలువలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ (పీఎస్ఆర్ బస్టాండ్) సమీప సర్వేపల్లి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హాఫ్హ్యాండ్స్ టీషర్ట్, బ్లాక్ లోయర్ ధరించి ఉన్నాడు. మృతదేహం ఉబ్చి దుర్ఘంధం వెదజల్లుతోంది. దీంతో చనిపోయి రెండు రోజులై ఉండొచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా?, ఆత్మహత్య చేసుకున్నాడా?, ఇతర కారణం ఉందా? అనేది పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్కు తెలియజేయాలని నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు.