‘డీకేడబ్ల్యూ’లో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

‘డీకేడబ్ల్యూ’లో జాబ్‌మేళా

Apr 27 2025 12:29 AM | Updated on Apr 27 2025 12:29 AM

‘డీకేడబ్ల్యూ’లో జాబ్‌మేళా

‘డీకేడబ్ల్యూ’లో జాబ్‌మేళా

నెల్లూరు (టౌన్‌): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను శనివారం నిర్వహించారు. రాత పరీక్ష, ఆపై ఇంటర్వ్యూలను జరపగా, 78 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్‌ గిరి తెలిపారు. జేకేసీ కోఆర్డినేటర్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మత్స్యకారుల ఖాతాల్లో

నగదు జమ

నెల్లూరు రూరల్‌: మత్స్యకారుల సేవలో పథకం ద్వారా జిల్లాలోని 12,239 మంది మత్స్యకారులకు రూ.24.47 కోట్లను వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారని మత్స్యశాఖ జిల్లా జేడీ నాగేశ్వరరావు తెలిపారు. పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం ప్రారంభించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి వర్చువల్‌గా వీక్షించిన అనంతరం జేడీ మాట్లాడారు. వేట నిషేధ కాలంలో భృతిగా రూ.20 వేలను విడుదల చేశారని చెప్పారు. కావలి నియోజకవర్గంలో 4778 మంది, కోవూరులో 3102 మంది, సర్వేపల్లిలో 1887 మంది, కందుకూరులో 2472 మందికి ఈ భృతిని అందజేశారని వివరించారు. మత్స్యశాఖ అధికారులు చాంద్‌బాషా, శ్రీనివాసులు, మత్స్యకార సంఘ నేతలు కొండూరు పాలిశెట్టి, పామంజి శేషయ్య, కొమారి విజయమ్మ, రామాని నారాయణ, భక్తాని శ్రీను, ఆవల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకమంటూ

నగదు కొట్టేశారు

గృహిణికి సైబర్‌ నేరగాళ్ల టోకరా

కావలి: ప్రభుత్వ పథకానికి సంబంధించిన నగదును జమచేస్తామంటూ పట్టణంలో ఓ గృహిణికి సైబర్‌ నేరగాళ్లు టోకరా వేసి రూ.71 వేలను కొట్టేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. సంక్షేమ పథకానికి సంబంధించిన నగదును జమ చేస్తామంటూ పట్టణానికి చెందిన భాను అనే గృహిణికి ఓ నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. తొలుత ఓ పురుషుడు మాట్లాడి, ఆపై ఓ మహిళకు కాల్‌ను బదిలీ చేశారు. భానుతో మాటలు కలిపి, వాట్సాప్‌ కాల్‌ చేస్తానని, లిఫ్ట్‌ చేయాలని సూచించారు. వెంటనే మరో నంబర్‌ నుంచి ఫోన్‌ చేసి, క్యూఆర్‌ కోడ్‌ పంపుతానని దాన్ని ఓకే చేయగానే, ఖాతాలో నగదు జమవుతుందని చెప్పారు. మొదటిసారి పంపిన క్యూఆర్‌ కోడ్‌ను భాను ఓకే చేసినా, ఏదో సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా అవతలి ఫోన్లో ఉన్న మహిళ మభ్యపెట్టారు. ఇలా ఆరుసార్లు పంపగా, ఓకే క్లిక్‌ చేశారు. ఈ తరుణంలో తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.71 వేలు కట్‌ అయినట్లు భాను ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో వెంటనే తనకు ఫోన్‌ వచ్చిన నంబర్‌కు కాల్‌ చేయగా, మనుగడలో లేదనే సమాధానం వచ్చింది. జరిగిన వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసి కన్నీటిపర్యంతయ్యారు. ఘటన పై కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement