22న పెంచలకోనలో జ్యేష్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

22న పెంచలకోనలో జ్యేష్టాభిషేకం

Jun 14 2024 12:02 AM | Updated on Jun 14 2024 12:02 AM

రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీరసింహస్వామి ఆలయంలో ఈనెల 22వ తేదీన జ్యేష్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. జ్యేష్ట మాసంలో జ్యేష్టా నక్షత్రం, పౌర్ణమి ఒకేరోజు వచ్చిన సందర్భంగా వైష్ణవాలయాల్లో హోమం, అభిషేకాలు నిర్వహంచడం ఆచారమన్నారు. ఉదయం 5 గంటలకు సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవ, నరసింహ హోమం, 10 గంటలకు శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో స్నపన పీఠంపై నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిదేవి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి 81 కలశాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement