
ప్రపంచకప్ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు వరుసగా రెండో లీగ్ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించింది. నెదర్లాండ్స్లో చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్ను భారత్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్తో భారత్ స్కోరును సమం చేసింది.