మలేసియా మాస్టర్స్‌లో భారత్‌కు నిరాశాజనక ఫలితాలు

Treesa Jolly And Gayatri Gopichand Duo Exits From Malaysia Masters - Sakshi

మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తొలి రోజు భారత్‌కు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 14–21, 14–21తో పియర్లీ టాన్‌–తినా (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన అశ్విని–శిఖా; దండు పూజ–ఆరతి జోడీలు కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయాయి. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాళవిక 10–21, 17–21తో గో జిన్‌ వె (మలేసియా) చేతిలో ఓటమి పాలైంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top