Rohit Sharma-Shikar Dhawan: రికార్డుల కోసమే ఆడుతున్నట్లుంది.. రోహిత్‌-ధావన్‌ ద్వయం అరుదైన ఫీట్‌

Rohit Sharma-Shikar Dhawan 2nd India Opening Pair Complete 5000 Runs ODI - Sakshi

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రికార్డుల పంట పండిస్తున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీలు బౌలింగ్‌లో అరుదైన ఫీట్లను అందుకోగా.. తాజాగా బ్యాటింగ్‌లో ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ- శిఖర్‌ ధావన్‌ ద్వయం పరుగులు విషయంలో కొత్త రికార్డును అందుకున్నారు. తాజాగా ఇంగ్లండ్‌తో వన్డే ద్వారా ఈ ఓపెనింగ్‌ జోడి 5వేల పరుగుల మార్క్‌ను క్రాస్‌ చేసింది. 5వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 114 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. కాగా సచిన్‌-గంగూలీ జోడి తర్వాత వన్డేల్లో తొలి వికెట్‌కు 5వేల పరుగులు జోడించిన రెండో ఓపెనింగ్‌ జోడిగా నిలిచి చరిత్రకెక్కింది.

ఇంతకముందు వన్డే క్రికెట్‌లో సచిన్‌-గంగూలీ ద్వయం 136 ఇన్నింగ్స్‌ల్లో 6609 పరుగులు జోడించి తొలి స్థానంలో ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఆసీస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఓపెనింగ్‌ జోడీ మాథ్యూ హేడెన్‌-ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (114 ఇన్నింగ్స్‌ల్లో 5472), విండీస్‌ లెజెండరీ ఓపెనింగ్‌ పెయిర్‌ గార్డన్‌ గ్రీనిడ్జ్‌-డెస్మండ్‌ హేన్స్‌ (102 ఇన్నింగ్స్‌ల్లో 5150) ఉన్నారు. తాజాగా వీరి సరసన రోహిత్‌ శర్మ- ధావన్‌ జోడి చోటు సంపాదించింది.

చదవండి: Jasprit Bumrah: ఇంగ్లండ్‌ గడ్డపై బుమ్రా కొత్త చరిత్ర..

Mohammed Shami: షమీ సంచలనం.. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top