చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌.. పాత రికార్డులన్నీ బద్దలు | RCB Vs PBKS IPL 2025 Final Becomes Most Watched T20 Game In World Cricket History, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌.. పాత రికార్డులన్నీ బద్దలు

Jun 20 2025 8:32 AM | Updated on Jun 20 2025 10:32 AM

RCB VS PBKS IPL 2025 Final Becomes Most Watched T20 Game In World Cricket History

వ్యూయర్షిప్‌ విషయంలో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ రికార్డులను తిరగరాసింది. క్రికెట్ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన టీ20 మ్యాచ్‌గా చరిత్ర సృష్టించింది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌ వీక్షణ సమయం 31.7 బిలియన్ నిమిషాలు అని అధికారిక టీవీ మరియు డిజిటల్ ప్రసారకులు జియోస్టార్ గురువారం తెలిపారు. టీవీ మరియు డిజిటల్ వ్యూయర్షిప్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు.

టీవీ వ్యూయర్షిప్‌కు (స్టార్ స్పోర్ట్స్) సంబంధించి ఈ మ్యాచ్‌ అత్యధిక రీచ్‌ (169 మిలియన్ల వీక్షకులు మరియు 15 బిలియన్ నిమిషాల వీక్షణ సమయం) నమోదు చేసిన టీ20 మ్యాచ్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 

జియో హాట్‌స్టార్‌లో ఈ మ్యాచ్ డిజిటల్ చరిత్రను తిరిగరాసింది. 892 మిలియన్ వీడియో వ్యూస్, 55 మిలియన్ల పీక్ కంకరెన్సీ, 16.74 బిలియన్ నిమిషాల వీక్షణ సమయంతో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద టీ20 మ్యాచ్‌గా అవతరించింది.

ఈ ఒక్క మ్యాచే కాకుండా సీజన్‌ మొత్తంలో ప్రసారకులు కొత్త గరిష్టాలను నమోదు చేశారు. వీక్షకుల సంఖ్య టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. 840 బిలియన్ నిమిషాలకు పైగా  వీక్షణ సమయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

డిజిటల్‌లో జియోహాట్‌స్టార్ 23.1 బిలియన్లకు పైగా వీక్షణలు మరియు 384.6 బిలియన్ నిమిషాల వాచ్-టైమ్‌తో కొత్త బెంచ్‌మార్క్‌లను నెలకొల్పింది. ఇది డిజిటల్ వీక్షణలో సంవత్సరానికి 29% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. కనెక్టెడ్ టీవీ (CTV) వినియోగంలో పదునైన పెరుగుదల ఈ ఊపుకు దారితీసింది. ఈ ఒక్కటే 49 శాతం పెరిగింది. ఇది భారతదేశంలో పెద్ద స్క్రీన్ డిజిటల్ వీక్షణ వృద్ధిని నొక్కి చెబుతుంది. 

టీవీలో స్టార్ స్పోర్ట్స్ 456 బిలియన్ నిమిషాల వాచ్ టైమ్‌ను పొందిం అత్యధిక రేటింగ్‌ను నమోదు చేసింది.

కాగా, జూన్‌ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ను గెలుచుకుంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement