Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం | Paris Paralympics 2024: Avani Lekhara wins gold, monu wins bronze | Sakshi
Sakshi News home page

Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం

Aug 30 2024 4:29 PM | Updated on Aug 30 2024 6:34 PM

Paris Paralympics 2024: Avani Lekhara wins gold, monu wins bronze

ప్యారిస్  వేదిక‌గా జ‌రుగుతున్న పారా ఒలింపిక్స్‌-2024లో భార‌త్ ప‌త‌కాల ఖాతా తెరిచింది. భార‌త పారా షూట‌ర్ అవని లేఖరా ప‌సిడి ప‌త‌కంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో బంగారుపతకం సాధించింది. ఫైన‌ల్లో 249.7 స్కోరు సాధించి అగ్ర‌స్ధానంలో నిలిచిన అవ‌ని.. గోల్డ్‌మెడ‌ల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. 

కాగా పారా ఒలింపిక్స్‌లో అవ‌నీకి ఇది రెండో బంగారు ప‌త‌కం కావడం గ‌మ‌నార్హం. టోక్యో పారాలింపిక్స్‌-2021లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో 22 ఏళ్ల అవ‌ని ప‌సిడి ప‌త‌కం సొంతం చేసుకుంది. ఈ క్ర‌మంలో ఓ అరుదైన ఘ‌న‌త‌ను ఆమె త‌న పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భార‌త మ‌హిళా షూట‌ర్‌గా అవ‌ని చ‌రిత్ర సృష్టించింది.

కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్‌..
ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement