
కబడ్డీ లెజెండ్, స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హర్యానాకు చెందిన పర్దీప్ నర్వాల్.. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ (PKL) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
స్పోర్ట్స్ బ్రాడ్క్టాస్టర్ సునీల్ తనేజాతో ఇంటారక్షన్లో పర్ధీప్ ఈ షాకింగ్ న్యూస్ను వెల్లడించాడు. కోచ్గా తన కొత్త అవతరామెత్తనున్నట్లు నర్వాల్ తెలిపాడు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో పర్దీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. పాట్నా పైరేట్స్ వరుసగా మూడు పీకెఎల్ టైటిల్స్ను గెలవడంలో నర్వాల్ది కీలక పాత్ర.
అదేవిధంగా ప్రోకబడ్డీ లీగ్ హిస్టరీలో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు కూడా నర్వాల్ పేరిట ఉంది. ఈ హర్యానా ఆటగాడు పీఎకెల్లో 190 మ్యాచ్లు ఆడి 1801 పాయింట్లు సాధించాడు. మ్యాచ్కు సగటున 9.47 రైడ్ సాధించడం విశేషం.
అయితే గత నాలుగు సీజన్లలో పర్ధీప్ తన ఫామ్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. యుపి యోధాస్, బెంగళూరు బుల్స్ తరపున నర్వాల్ పెద్దగా రాణించలేకపోయాడు. కాగా గతంలో భారత కబడ్డీ జట్టుకు కూడా నర్వాల్ ఆడాడు.
చదవండి: IPL 2025 Final: 'అతడితో పంజాబ్ జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే వార్ వన్ సైడే'