ఎన్‌సీసీ ప్యానెల్‌లో ధోని  | MS Dhoni Named 15 Member Defence Ministry Panel On NCC | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీ ప్యానెల్‌లో ధోని 

Sep 17 2021 7:41 AM | Updated on Sep 17 2021 8:31 AM

MS Dhoni Named 15 Member Defence Ministry Panel On NCC - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ ధోనిని నేషనల్‌ క్యాడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ)ని సరికొత్తగా తీర్చిదిద్దే కమిటీలో సభ్యుడిగా నియమించారు. రక్షణ మంత్రిత్వ శాఖ నియమించిన 15 మంది సభ్యుల ఈ కమిటీలో ధోని సహా పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర, ఇతర రంగాల నిపుణులున్నారు. భారత ఆర్మీలో ధోని గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అతని పేరును కమిటీలో చేర్చింది. క్రమశిక్షణ, కార్యదీక్షతకు మారుపేరైన ఎన్‌సీసీ ని మరింత మెరుగు పరిచేందుకు తీసుకోవా ల్సిన చర్యలపై ఎన్‌సీసీ కమిటీ చర్చిస్తుంది.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement