చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. విరాట్‌ కోహ్లి రికార్డు బ్రేక్‌ | KL Rahul Breaks Virat Kohlis Record For Fastest 8,000 T20 Runs As Indian Batter, Check Story For Details | Sakshi
Sakshi News home page

IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. విరాట్‌ కోహ్లి రికార్డు బ్రేక్‌

May 18 2025 8:55 PM | Updated on May 19 2025 4:57 PM

KL Rahul breaks Virat Kohlis record for fastest 8,000 T20 runs as Indian batter

PC: BCCI/IPL.com

టీమిండియా స్టార్ బ్యాటర్‌, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. 

రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.

ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గ‌జం  (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండ‌గా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజం(218) కొన‌సాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్‌ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.

రాహుల్‌ సూపర్‌ సెంచరీ..
ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్‌ అద్బుత ఇన్నింగ్స్‌ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్‌(30), అక్షర్ పటేల్‌(25), స్టబ్స్‌(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్‌, సాయికిషోర్‌, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: రాజ‌స్తాన్‌పై విజ‌యం.. ప్లే ఆఫ్స్‌కు చేరువ‌లో పంజాబ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement