ఐపీఎల్‌ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే..? | IPL 2025 Team Of The Tournament: Shreyas Iyer Captain, Virat Kohli In, Shubman Gill Out | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ 2025 జట్టు ప్రకటన.. కెప్టెన్‌ ఎవరంటే..?

Jun 6 2025 5:58 PM | Updated on Jun 6 2025 7:13 PM

IPL 2025 Team Of The Tournament: Shreyas Iyer Captain, Virat Kohli In, Shubman Gill Out

ఐపీఎల్‌ 2025 సీజన్‌ జూన్‌ 3న జరిగిన ఫైనల్‌తో ముగిసింది. ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఇది తొలి టైటిల్‌. 18 ఏళ్ల ప్రస్తానంలో ఆ జట్టు మూడు సార్లు ఫైనల్‌కు చేరినా రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నాలుగో ప్రయత్నంలో ఆ జట్టు టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. 

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది. రెండో ప్రయత్నంలోనూ ఆ జట్టుకు నిరాశే మిగిలింది. సీజన్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించినా పంజాబ్‌ తుది మెట్టుపై బోల్తా పడింది. కొత్త కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 

ఫైనల్లో ఓడినా పంజాబ్‌ మంచి మార్కులే కొట్టేసింది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ శ్రేయస్‌ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. శ్రేయస్‌ ఐపీఎల్‌లో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2025 టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ను తాజాగా ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు. ఈ జట్టులో ఈ సీజన్‌ స్టార్లందరికీ చోటు దక్కింది. గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ మాత్రం ఈ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 

ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఆర్సీబీ ఆటగాళ్లకు చోటు దక్కింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కొహ్లి సహా జితేశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా, జోష్‌ హాజిల్‌వుడ్‌ చోటు దక్కించుకున్నారు. వికెట్‌కీపర్‌గా జితేశ్‌ శర్మ ఎంపికయ్యాడు. ఇంపాక్ట్‌ సబ్‌గా సీఎస్‌కే స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ను ఎంపిక చేశారు.

ఈ జట్టుకు ఓపెనర్లుగా విరాట్‌ కోహ్లి, గుజరాత్‌ ఆటగాడు సాయి సుదర్శన్‌ ఎంపిక కాగా.. వన్‌డౌన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌, నాలుగో స్థానంలో ముంబై విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌, ఐదో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌, ఆరో స్థానంలో జితేశ్‌ శర్మ, ఏడో ప్లేస్‌లో శశాంక్‌ సింగ్‌, ఆల్‌రౌండర్ల కోటాలో కృనాల్‌ పాండ్యా, స్పెషలిస్ట్‌ పేసర్లుగా బుమ్రా, హాజిల్‌వుడ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ ఎంపికయ్యారు. 

ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టు ఎంపిక జరిగింది. పంజాబ్‌ లోయర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శశాంక్‌ సింగ్‌కు ఈ జట్టులో అనూహ్యంగా చోటు దక్కింది.  

ఐపీఎల్‌ 2025 టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌: విరాట్‌ కోహ్లి, సాయి సుదర్శన్‌, నికోలస్‌ పూరన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శశాంక్‌ సింగ​్‌, కృనాల్‌ పాండ్యా, జస్ప్రీత్‌ బుమ్రా, జోష్‌ హాజిల్‌వుడ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, నూర్‌ అహ్మద్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement