పరాజయంతో ప్రారంభం

Indian womens team suffers 18-run loss to New Zealand in one-off T20 International - Sakshi

ఏకైక టి20లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిన భారత మహిళల జట్టు

క్వీన్స్‌టౌన్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనను పరాజయంతో మొదలుపెట్టింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్‌ 18 పరుగుల తేడాతో గెలిచింది. మొదట న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. సుజీ బేట్స్‌ (36; 2 ఫోర్లు), కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

పూజ, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేసింది. ఆంధ్రపదేశ్‌కు చెందిన సబ్బినేని మేఘన (30 బంతుల్లో 37; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12) నిరాశపరిచింది. క్వారంటైన్‌ లో ఉండటంతో స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు దూరమైంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 12న జరిగే తొలి వన్డేలోనూ స్మృతి బరిలో దిగే అవకాశం కనిపించడంలేదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top