మళ్లీ ఓడిన భారత్‌  | India lost again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన భారత్‌ 

Apr 13 2024 3:43 AM | Updated on Apr 13 2024 3:43 AM

India lost again - Sakshi

పెర్త్‌: ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో పరాజయం చేరింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 1–3 గోల్స్‌ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది.

భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (12వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్‌ (19వ, 47వ ని.లో) రెండు గోల్స్, జేక్‌ వెల్చ్‌ (54వ ని.లో) ఒక గోల్‌ అందించారు. ఈ సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్‌ నేడు జరుగుతుంది.  

Advertisement
 
Advertisement
Advertisement