Independence Day 2021: జాతీయ గీతాన్ని మార్మోగించాడు

Independence Day 2021: Special Story for Neeraj Chopra Who Wins Historic Olympic Gold in Athletics - Sakshi

భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి  అంతర్జాతీయ వేదికపై భారత్‌ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో  నీరజ్‌ రెండో రౌండ్‌లో 87.58 మీటర్లు విసిరి సీజన్‌ బెస్ట్‌ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్‌ ముగింపు ఇచ్చాడు. ఆగస్టు 15తో 75 ఏళ్ల స్వాతం‍త్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతావని జాతీయ గీతాన్ని జపాన్‌ గడ్డపై మారుమోగించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top