
సొంతగడ్డపై సమ్మర్ సీజన్ షెడ్యూల్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ మాజీ పేసర్ టిమ్ సౌథీ (Tim Southee)ని కోచింగ్ సిబ్బందిలో చేర్చుకునే దిశగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
కాగా గతేడాది అంతర్జాతీయ క్రికెట్కుఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు ఇంగ్లిష్ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కన్సల్టెంట్గా అతడు పనిచేశాడు. అయితే, దేశవాళీ క్రికెట్లో లంకాషైర్ తరఫున ఆడేందుకు ఆండర్సన్ సిద్ధం కావడంతో ఆ పోస్టు ఖాళీ అయింది.
ఈ నేపథ్యంలోనే కివీస్ మాజీ ఆటగాడు టిమ్ సౌథీకి ఇంగ్లండ్ బోర్డు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కాగా ఇంగ్లండ్ టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్ హెడ్కోచ్గా న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. రెడ్బాల్ క్రికెట్లో మెకల్లమ్ ‘బజ్బాల్’తో సరికొత్త ప్రయోగాలు చేసి సఫలమైనా.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు.
ఇప్పటికే న్యూజిలాండ్ నుంచి జీతన్ పటేల్ కూడా
ఇదిలా ఉంటే.. సౌథీతో మెకల్లమ్కు మంచి అనుబంధం ఉంది. అతడి చొరవతోనే ఇంగ్లిష్ జట్టు బోర్డు ఈ కివీస్ పేసర్ను కోచింగ్ సిబ్బందిలోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు బీబీసీ తన కథనంలో పేర్కొంది.
కాగా మెకల్లమ్ జట్టులో ఇప్పటికే న్యూజిలాండ్ నుంచి జీతన్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇంగ్లండ్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్గా అతడు సేవలు అందిస్తున్నాడు. ఇక సౌథీ కూడా చేరితే హెడ్కోచ్తో కలిపి ఈ సంఖ్య మూడుకు చేరుతుంది.
టీమిండియాతో ఐదు టెస్టులు
ఇక 36 ఏళ్ల టిమ్ సౌథీ గతేడాది డిసెంబరులో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తరఫున 107 టెస్టులు, 161 వన్డేలు, 125 టీ20 మ్యాచ్లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్... ఆయా ఫార్మాట్లలో 391, 221, 164 వికెట్లు తీశాడు.
కాగా ఇంగ్లండ్ జింబాబ్వేతో ఏకైక టెస్టుతో తమ వేసవి సీజన్ను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అనంతరం జూన్ 20 నుంచి టీమిండియాతో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనుంది.
చదవండి: ఇంగ్లండ్ టూర్కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్కు కూడా పిలుపు..?