Anchal Thakur: అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్కు కాంస్యం
మోంటెనిగ్రోలో జరిగిన అంతర్జాతీయ అల్పైన్ స్కీయింగ్ టోర్నీలో భారత క్రీడాకారిణి ఆంచల్ ఠాకూర్ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన జెయింట్ స్లాలోమ్ ఈవెంట్ను ఆంచల్ 1ని:54.30 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. హిమాచల్ప్రదేశ్కు చెందిన 25 ఏళ్ల ఆంచల్ 2018లో టర్కీలో జరిగిన టోర్నీలోనూ కాంస్యం గెలిచింది. గతంలో ఆమె నాలుగుసార్లు ప్రపంచ స్కీయింగ్ చాంపియన్షిప్లలో పోటీ పడింది.
మరిన్ని వార్తలు