Anchal Thakur: అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం 

Anchal Thakur Won Bronze In International Skiing Tourney - Sakshi

మోంటెనిగ్రోలో జరిగిన అంతర్జాతీయ అల్పైన్‌ స్కీయింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారిణి ఆంచల్‌ ఠాకూర్‌ కాంస్య పతకంతో మెరిసింది. గురువారం జరిగిన జెయింట్‌ స్లాలోమ్‌ ఈవెంట్‌ను ఆంచల్‌ 1ని:54.30 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల ఆంచల్‌ 2018లో టర్కీలో జరిగిన టోర్నీలోనూ కాంస్యం గెలిచింది. గతంలో ఆమె నాలుగుసార్లు ప్రపంచ స్కీయింగ్‌ చాంపియన్‌షిప్‌లలో పోటీ పడింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top