జహీరాబాద్ టౌన్: నా కూతురును సర్కారు బడిలో చేర్పించాను. ప్రైవేట్ పాఠశాలను కాదని బూచినెల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో నా కూతురు స్వీటీకి అడ్మిషన్ తీసుకున్నా. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. బడి బాట కార్యక్రమంలో నా కూతురును సర్కారు బడిలో చేర్పించి మరి కొంతమంది పిల్లలకు కూడా అడ్మిషన్ ఇప్పించాను. ప్రభుత్వ పాఠశాలలో అత్యంత అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పంపించి డబ్బులు వృథా చేసుకోవద్దు.
– సర్పంచ్ సునీత, బూచినెల్లి గ్రామం


