తండ్రికి సూసైడ్‌ నోట్‌ పంపి.. వైద్యుడి అదృశ్యం.. | - | Sakshi
Sakshi News home page

తండ్రికి సూసైడ్‌ నోట్‌ పంపి.. వైద్యుడి అదృశ్యం..

Aug 7 2023 7:02 AM | Updated on Aug 7 2023 9:04 AM

- - Sakshi

సంగారెడ్డి: డాక్టర్‌ అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఎమ్‌ఎన్‌ఆర్‌ వద్ద చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నపిల్లలు డాక్టర్‌ గోకుల్‌ నాథ(27) ఎమ్‌ఎన్‌ఆర్‌ వద్ద ఉన్న ఆశీష్‌ బాయ్స్‌ హాస్టల్‌లో ఉండేవాడు.

రోజులాగే హాస్టల్‌ నుంచి రాత్రి 8 గంటల సమయంలో బయలుదేరాడు. తెల్లవారుజాము 4.30 సమయంలో తండ్రి మురుగన్‌.. హాస్టల్‌ వార్డెన్‌ నర్సింగరావుకు ఫోన్‌ చేశాడు. వెంటనే వాట్సాప్‌లో సూసైడ్‌ నోట్‌ రాసి పంపి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడని నర్సింగరావు తెలిపారు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రూరల్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement