సీఐ రఘువీర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

సీఐ రఘువీర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి

Dec 2 2023 5:00 AM | Updated on Dec 2 2023 11:40 AM

- - Sakshi

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఎన్నికల విధుల్లో భాగంగా ఏఆర్‌ కానిస్టేబుల్‌ యాదగిరిపై లాఠీతో దాడిచేసిన ఆదిబట్ల సీఐ రఘువీర్‌రెడ్డిపై చర్యలు తీసుకొవాలని కోరుతూ అతడి తోటి ఏఆర్‌ కానిస్టేబుళ్లు గురువారం డీజీపీకి ఫిర్యాదు చేశారు.

డిసెంబర్‌ 30న జరిగిన మహేశ్వరం నియోజకవర్గంలోని పోలింగ్‌లో భాగంగా నాదర్‌గుల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములకు గన్‌మెన్‌గా ఉన్న యాదగిరిపై దాడి చేయడంతో పాటు అవమానపర్చిన ఆదిబట్ల సీఐ రఘువీర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల సంఘం, చీఫ్‌ ఎన్నికల అధికారులకు తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్స్‌ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసుల పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న యాదగిరిపై అకారణంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement