మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తి నరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్కసారి మత్తు పదార్థాలు తీసుకుంటే దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తి ఉత్తేజాన్ని కోల్పోతాడు. సహజ మనస్తత్వాన్ని కోల్పోయి, ఉద్వేగభరితంగా వ్యవహరిస్తాడు. మైండ్ లోపల కార్టి సాల్ అనే హోర్మోన్స్ ప్రభావం, ఒత్తిడితో మత్తును మళ్లీ మళ్లీ తీసకోవాలనే ఆలోచనతోపాటు వింతగా ప్రవర్తిస్తాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కౌన్సెలింగ్ సెంటర్కు వచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం.
– డాక్టర్ ప్రవీణ్కుమార్ ఎంబీబీఎస్, ఎండీ, మానసిక వైద్యనిపుణులు


