రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు అన్నారు. మండలంలోని హరిదాస్నగర్లో గురువారం 25 సంఘాలకు వడ్డీలేని రుణాల ప్రొసీడింగ్స్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, సర్పంచ్ అమృత, కార్యదర్శి సంపత్, ఎంపీటీసీ మల్లేశం, వీవోఏ అక్షిత, వీవో అధ్యక్షురాలు జల్లి పద్మ, నాయకులు సిరికొండ నాగరాజు, శేఖర్, జనార్ధన్, మహిళలు పాల్గొన్నారు.