తాటిపర్తి చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

తాటిపర్తి చంద్రశేఖర్‌

Jan 3 2024 5:04 AM | Updated on Jan 3 2024 5:04 AM

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న తాటిపర్తి చంద్రశేఖర్‌   - Sakshi

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న తాటిపర్తి చంద్రశేఖర్‌

యర్రగొండపాలెం ఇన్‌చార్జిగా

సింగరాయకొండ: వైఎస్సార్‌ సీపీ యర్రగొండపాలెం ఇన్‌చార్జిగా తాటిపర్తి చంద్రశేఖర్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. సింగరాయకొండ పంచాయతీ సుందర్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్‌ విద్యావంతుడు, వ్యాపారవేత్త, బిల్డర్‌, హెచ్‌ఎస్‌సీ సంస్థల అధినేతగా గుర్తింపు సాధించాడు. అతని తల్లిదండ్రులు హుస్సేన్‌, చెంచమ్మ, భార్య భాగ్యసీమ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహణలో చంద్రశేఖర్‌కు మంచి గుర్తింపు ఉంది. వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, ఆలయాలు, చర్చిలు, మసీదులకు విరాళాలు, క్రీడల ప్రోత్సాహకానికి ఆర్థిక సాయం, నిరుపేదల అంత్యక్రియలకు ఆర్థికసాయం, పేద వధూవరులకు తాళిబొట్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన చురుగ్గా పాల్గొని పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. పార్టీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో యర్రగొండపాలెంలో భారీ మెజారిటీ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులందరినీ కలుపుకుని పార్టీ విజయానికి పాటుపడతానని తెలిపారు. తాటిపర్తిని యర్రగొండపాలెం ఇన్‌చార్జిగా ప్రకటించగానే అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement