మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Serious On TDP MLA Madhavi Reddy | Sakshi
Sakshi News home page

మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి: వైఎస్సార్‌సీపీ నేతలు

Sep 25 2024 12:24 PM | Updated on Sep 25 2024 12:28 PM

YSRCP Leaders Serious On TDP MLA Madhavi Reddy

సాక్షి, వైఎస్సార్‌: అధికారం చేతిలో ఉందని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వైఎస్సార్‌ జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు. ఇదే సమయంలో​ వందేళ్ల క్రితమే కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.

అయితే, వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ ఎ‍మ్మెల్యే మాధవి రెడ్డి ప్రోద్బలంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడులు జరుగుతున్నాయి. అన్నీ అనుమతులు ఉన్నప్పటికీ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ భాగస్వామిగా ఉన్న లే అవుట్‌పైకి ఇరిగేషన్‌ శాఖ అధికారులను ఎమ్మెల్యే పంపించారు. లే అవుట్‌ నుండి వాగు వెళ్తోందంటూ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. వందేళ్ల క్రితం కనుమరుగైన వాగు పేరుతో ఎమ్మెల్యే మాధవి రెడ్డి రాజకీయం మొదలుపట్టారు. ఈ అంశంపై హై కోర్టులో స్టే ఉన్నా ఇబ్బంది పెట్టేందుకు కుటిల ప్రయత్నం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లే అవుట్‌ వద్దకు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి,   ఇతర కార్పొరేటర్లు బుధవారం చేరుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..‘కోర్టులో స్టే ఉన్నా రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన పద్దతి కాదు. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. మాధవి రెడ్డి కక్ష సాధింపు చర్యలు ఇప్పటికైనా మానుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ఇక చంద్రబాబు కోరినట్టే సిట్‌ నివేదిక: ఎంపీ విజయసాయి రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement