‘బాబును కలిశాకే పవన్‌ను మందకృష్ణ తిట్టింది’ | Vijayasai Reddy Slams Chandrababu On Manda Krishna Comments Pawan kalyan | Sakshi
Sakshi News home page

మందకృష్ణను తిడుతున్నారు కానీ.. బాబును ఒక్క మాట అనరేం!: విజయసాయిరెడ్డి

Nov 6 2024 5:00 PM | Updated on Nov 6 2024 5:28 PM

Vijayasai Reddy Slams Chandrababu On Manda Krishna Comments Pawan kalyan

సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిసిన సంగతి తెలిసిందే. అయితే బాబుతో గంటపాటు మాట్లాడి బయటకు వచ్చిన మందకృష్ణ.. పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌ వ్యాఖ్యలు మాదిగ మహిళలను అవమానించినట్లే ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ ఫెయిల్‌ అయ్యిందంటే అది హోంమంత్రినే కాదు, ప్రభుత్వం, చంద్రబాబును అన్నట్లే కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే బాబును కలిసిన తర్వాత మందకృష్ణ.. పవన్‌ను ఎందుకు తిట్టాడన్న సందేహం ఆయన అభిమానులకు రాలేదంటారా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. పవన్‌ అభిమానులు కృష్ణ మాదిగని తిడుతున్నారు కానీ.. ఆయనతో తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడం లేదని తెలిపారు. ఇదే చంద్రబాబు మార్క్‌ రాజకీయమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement