సాక్షి, విశాఖపట్నం విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం చంద్రనగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో అకస్మాత్తుగా పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికుల అనుమానం ప్రకారం ఆ ఇంట్లో బాణాసంచా నిల్వ చేసి ఉండవచ్చని చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పేలుడు జరిగిన కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


