నా బిడ్డది ముమ్మూటికీ రాజకీయ హత్యే: రషీద్‌ తల్లిదండ్రులు | Rashid parents Allegations On TDP Govt And Home Minister Anitha | Sakshi
Sakshi News home page

నా కొడుకుది ముమ్మూటికీ రాజకీయ హత్యే: రషీద్‌ తల్లిదండ్రులు

Jul 22 2024 3:51 PM | Updated on Jul 22 2024 6:38 PM

Rashid parents Allegations On TDP Govt And Home Minister Anitha

సాక్షి, పల్నాడు జిల్లా: ముమ్మాటికీ తన బిడ్డది రాజకీయ హత్యేనని రషీద్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. రషీద్‌ను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీఎస్‌ అంజనేయులే చంపించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీలో యాక్టివ్‌గా పనిచేస్తున్నాడనే టీడీపీ నేతలు తన బిడ్డను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ హత్యపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్యాయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆమె కూడా ఓ మహిళే కదా.. తల్లి కడుపు కోత తెలియదా అని ప్రశ్నించారు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు.ప్రభుత్వం న్యాయం చేసేదే అయితే ఎందుకు తమ దగ్గరకు వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పలేదని రషీద్‌ తల్లిదండ్రులు ప్రశ్నించారు. 

కొంతమంది ఫోన్ చేసి తమ కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమ ఇంటికి వచ్చి న్యాయం చేస్తానని చెప్పారని తెలిపారు. అసెంబ్లీలో రషీద్ హత్యపై వైఎస్‌ జగన్‌ పోరాడుతుంటే పోలీసులు ఎందుకు ప్లే కార్డులు లాక్కున్నారని ప్రశ్నించారు.

‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు మాట్లాడను ఇవ్వటం లేదు. ఒక మనిషిని అన్యాయంగా చంపితే ఆయన తరుపున మాట్లాడే హక్కు లేదా?. పార్టీ పరంగా అడిగే హక్కు వైఎస్ జగన్‌కు లేదా?. ఎందుకు ప్రభుత్వం, పోలీసులు పదేపదే నా బిడ్డది వ్యక్తిగత కారణాల వల్ల జరిగిన హత్యానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement