అధికారమే కాదు..ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు | Ramachandrayya comments on chandrababau naidu | Sakshi
Sakshi News home page

అధికారమే కాదు..ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు

Apr 10 2021 5:43 PM | Updated on Apr 10 2021 7:57 PM

Ramachandrayya comments on chandrababau naidu - Sakshi

అమరావతి: తన హయాంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబునాయుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద విమర్శలు చేసే ముందు తన హయాంలో జరిగిన రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబు చర్చకు సిద్ధమా? అని రామచంద్రయ్య ప్రశ్నించారు. బాబు పెట్టుబడుల పేరుతో బాబు నానాహంగామా చేశారని, అది సరిపోదన్నట్లు ప్రపంచమంతా తిరిగారని అన్నారు. అంతా చేసి రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా అంటే అదీ లేదని, ఇలా అడ్డగోలుగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు.  

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఇక రాష్ట్రాంలో మరో సింగపూర్‌లా అమరావతిని మారుస్తానంటూ గ్రాఫిక్స్ చూపించారు. గతంలో చంద్రబాబు పరిపాలనకు, ఆయన ప్రజలకు చేసిన మోసానికి అధికారమే కాదు. వారి విశ్వాసాన్నీ కూడా కోల్పోయారన్న విషయాన్ని తెలుసుకోవాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని  ప్రజలు సంతృప్తి గా ఉన్నారు. అన్ని వర్గాలు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. చంద్రబాబు మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఇకనైనా ఆయన గ్రహించాల’’ని సూచించారు. 

( చదవండి: తాగటం .. వాగటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement