ప్రొటోకాల్‌ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు | Mla Madhavaram Krishna Rao Complaint To Speaker On Protocol Violation | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్‌ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు

Aug 10 2024 1:26 PM | Updated on Aug 10 2024 1:34 PM

Mla Madhavaram Krishna Rao Complaint To Speaker On Protocol Violation

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్‌ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.

ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement