దోపిడీ సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి: కిలారి రోశయ్య

MLA Kilari Rosaiah Fires On Chandrababu Over Sangam Dairy Fraud - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ హయాంలో డెయిరీలను నిర్వీర్యం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. కోపరేటివ్‌ డెయిరీలను టీడీపీ నాయకులు దోచుకున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కిలారి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతుల గురించి చంద్రబాబు, లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. ప్రైవేట్‌ డెయిరీలను టీడీపీ నేతలు సొంత ఆస్తుల్లా భావించారని, సంగం డెయిరీలో మోసాలకు పాల్పడి అరెస్టైన వ్యక్తికి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘సంగం డెయిరీలో దొంగ సర్టిపికెట్లతో 70 ఎకరాలకు పైగా భూమి దోచుకున్నారు. సంగం డెయిరీ పేరిట దొంగ సర్టిఫికెట్లు సృష్టించి దోపిడీ చేశారు. దోపిడీ చేసిన సొమ్ములో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలి. ప్రభుత్వ ఆస్తులన్నీ యథేచ్ఛగా దోపిడీ చేశారు. టీడీపీ హయాంలో రైతులను నిలువునా మోసం చేశారు. టీడీపీ నాయకులు పాల రైతులను మోసం చేసి సంపాదించారు. రైతులు పూర్తిగా లాభపడాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారు. రైతులు వారికి రావాల్సిన లాభాలు వారు స్వేచ్ఛగా పొందాలి’’ అని ఎమ్మెల్యే రోశయ్య అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top