టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు | MLA Gummanur Jayaram Sensational Comments On YSRCP | Sakshi
Sakshi News home page

Gummanur Jayaram: టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు

Jun 29 2025 10:17 AM | Updated on Jun 29 2025 10:17 AM

MLA Gummanur Jayaram Sensational Comments On YSRCP

సాక్షి,గుంతకల్లు: ‘ఎవరేమనుకున్నా..నాకేంటి! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అంటూ అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

శనివారం గుంతకల్లులోని పరిటాల శ్రీరాములు కల్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయి క్లస్టర్‌ యూనిట్, బూత్‌ కార్యకర్తల సమావేశంతోపాటు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆ రోజు గుత్తిలో నిర్వహించిన సమావేశంలో అన్న మాటలు (వైఎస్సార్‌సీపీ నాయకులు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోగా టీడీపీలో చేరితే సరి.. లేదంటే తోకలు కత్తిరించి సున్నం అంటిస్తాం) రాష్ట్రమంతా వైరల్‌ అయ్యాయి. ఎక్కడ చూసినా గుంతకల్లు వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఇది వాస్తవం. నేనేమన్నా దౌర్జన్యాలు చేస్తానని చెప్పలేదే! ఉన్న మాట అంటే ఉలుకు అన్న చందంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చేస్తున్నారు. సరే.. వారు, ఎవరేమనుకున్నా నాకేంటి?! ఈ గుమ్మనూరు జయరాంకు ఏమన్నా లెక్కా’ అని వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement