కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం | Ec Bans Former Telangana Cm Kcr From Campaigning For 48 Hours | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం

May 1 2024 6:46 PM | Updated on May 1 2024 7:18 PM

Ec Bans Former Telangana Cm Kcr From Campaigning For 48 Hours

హైదరాబాద్‌, సాక్షి : మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్‌  తమపై, తమ పార్టీపై  అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు(బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది.  నిషేధ సమయంలో ఎలాంటి రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈసీ తన  ఆదేశాల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement