హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈటల రాజేందర్ భూ కబ్జాపై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన అలీబాబా నలభై దొంగలు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో పేదల భూములు ఆక్రమించుకున్నారనే విషయాన్ని తమ పార్టీ ఎన్నోసార్లు బహిరంగపరిచిందని తెలిపారు. గతంలో ప్రభుత్వం పలు కేసులపై విచారణను తెరపైకి తెచ్చి వాటిని పూర్తిగా నిలిపివేశారని భట్టి పేర్కొన్నారు.
గతంలో డ్రగ్స్ కేసు విచారణకు ఆదేశించి, పూర్తిగా ఆపేశారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. దాంతో పాటుగా ప్రభుత్వం మియాపూర్ భూములపై విచారణ చేస్తున్నట్లు ఆర్భాటం సృష్టించారే తప్ప ఇంతవరకు విచారణ కొలిక్కి రాలేదని తెలిపారు. ప్రభుత్వం మీద ఎదురుదాడి పెరుగుతున్న సమయంలో ప్రజల దృష్టి మరల్చడం కేసీఆర్కు అలవాటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరిగాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటలపై ఇలాంటి ఆరోపణలు బయటకు తీశారని పేర్కొన్నారు. కరోనా బారిన పడ్డ పేదలకు వ్యాక్సిన్ లేదు, బెడ్ లేదు, ఆక్సిజన్ లేదు, సిబ్బంది లేదు ప్రజల దృష్టి మళ్లించడానికి ఈటల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. ఈటల వ్యవహరంపై సీఎం ప్రజల ముందు వచ్చి నిజాలను బహిరంగపర్చాలని సవాల్ విసిరారు.
చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణలకు గురైన భూములను తిరిగి ప్రజలకు ఇవ్వాలని భట్టి విక్రమార్క్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా 111 జీఓపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోనేరు రంగారావుపై ఆరోపణలు వచ్చిన వెంటనే రాజీనామా చేసి విచారణ జరిపించినట్లు గుర్తుచేశారు. వారిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్న చరిత్ర కాంగ్రెస్దని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం శవాల పేరుతో రాజకీయం చేస్తోందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ను జైల్లో పెడతామని చెప్పిన బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర హోం శాఖ కి లేఖ రాయాలని పొన్నం సవాల్ విసిరారు.
ఈటల భూ కబ్జా: ‘కేసీఆర్ ఆడుతున్న రాజకీయ డ్రామా’
Published Sat, May 1 2021 9:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement