ఎటు చూసినా ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు... మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు.. కొండ వాలున నిర్మించుకున్న చిన్నచిన్న ఆవాసాలు..
అక్కడ నివసిస్తున్న గిరిజనుల సంప్రదాయాలు, కట్టుబాట్లు.. చిన్నారులను సంరక్షించే పిల్లలు.. సాలూరు మండలంలోని గిరిశిఖర గ్రామం శిఖపరువును సందర్శించేవారిని ఆకర్షిస్తాయి. కొండలను చదునుచేస్తూ.. వర్షపు నీటితో వారు పండించే పోడు పంటలు అబ్బురపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి. వరిలో కాలిబాటలు, వరుసల్లో నాటిన కూరగాయల మొక్కలు ఆధునిక వ్యవసాయాన్ని తలపిస్తాయి.
– సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం


