
బాల్య వివాహాలు అరికట్టాలి : కలెక్టర్
పార్వతీపురం టౌన్: బాల్య వివాహాలు అరికట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల పట్ల విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రుల నుంచి అంగీకారం పొందాలని అందుకు బాల్య వివాహాల వలన కలిగే దు ష్ప్రభావాల గూర్చి స్పష్టంగా వివరించాలన్నారు. వివిధ కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిస్థితుల రీత్యా బాల్య వివాహాలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సామాజిక స్థితిగతుల పట్ల వివరంగా చెప్పాలని ఆదేశించారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల బాల్యం కొల్పోతారని, చదువు, ఆరోగ్యం కోల్పోతారని. వారికి ఉన్న ఆశలు, ఆశయాలు సాధించే అవకాశం కోల్పోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటుదన్నారు. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులకు వివరించాలన్నారు.
తాగు నీటి సమస్య తలెత్తరాదు
జిల్లాలో తాగు నీటి సమస్య తలెత్తరాదని కలెక్టర్ ఆదేశించారు. కొన్ని మండలాల్లో తాగునీటి సమస్య తలెత్తుతున్నట్లు మీడియాలో వార్తులు వస్తున్నాయని, వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణం పునరుద్ధరించాలని ఆదేశించారు.