వైఆర్‌ఎస్‌ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

వైఆర్‌ఎస్‌ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌

Aug 19 2025 4:46 AM | Updated on Aug 19 2025 4:46 AM

వైఆర్‌ఎస్‌ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌

వైఆర్‌ఎస్‌ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్‌

● తొలుత పాఠశాల ఆవరణలోని మహాత్ముని విగ్రహానికి గురజాల ఆర్డీఓ మురళీకృష్ణతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతేడాది పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన నాదెండ్ల అమర వెంకటేష్‌కు ప్రోత్సాహక నగదు అందజేశారు. తహసీల్దార్‌ దొప్పలపూడి మేరీ కనకం, ఎంఈఓ–2 వై.శివనాగేశ్వరరావు, హెచ్‌ఎం కె.చంద్రశేఖర్‌, కరస్పాండెంట్‌ యేచూరి వెంకట సైదయ్య, ఎంపీటీసీ పాముల సంపూర్ణమ్మ, వార్డెన్‌ నూరెల్లా బేగ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెంటచింతల: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కృషిచేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు అన్నారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘మహాత్ముడు నడయాడిన రెంటచింతల’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పల్నాడు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు స్పందించి, నాడు మహాత్ముడు బస చేసిన వైఆర్‌ఎస్‌ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో గ్రామానికి చెందిన పల్నాటి గాంధీగా పేరు పొందిన నాళం మట్టపల్లి కుటుంబ సభ్యులను కలువడానికి అవకాశం ఉందా? ఆయన వారసులు ఎవరు.. ఎక్కడున్నారని.. వాకబు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమ యంలో ఈ ప్రాంతంలో నెలకొన్న సంగతులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైఆర్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులతో మమేకమై, వారికి పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య, విద్యా వలంటీర్ల వేతనాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పాఠ శాల వెనుకనున్న గదులను ఎందుకు మూసివేశారని అడిగారు. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు ఉన్నారని, మిగిలిన వారు విద్యా వలంటీర్లుగా పనిచేస్తున్నారని వా రికి పూర్వ విద్యార్థులు అందజేసిన విరాళాలతో వేతనాలు అందచేస్తున్నామని గతంలో 700 మందికి పైగా విద్యార్థులు ఉండేవారని హెచ్‌ఎం కొత్త చంద్రశేఖర్‌, కరస్పాండెంట్‌ యేచూరి వెంకట సైదయ్యలు కలెక్టర్‌కు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement