టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి! | Old woman appeals to Collector and SP | Sakshi
Sakshi News home page

టీడీపీ మహిళా నేత నుంచి కాపాడండి!

Aug 19 2025 4:51 AM | Updated on Aug 19 2025 4:51 AM

Old woman appeals to Collector and SP

పల్నాడు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు అంబులెన్స్‌లో వచ్చిన రోశమ్మ

కలెక్టర్, ఎస్పీకి వృద్ధురాలు వినతి.. ఆమె ఎకరంన్నర 

స్థలం దురాక్రమణకు మహిళా నేత దౌర్జన్యం 

ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి బాధితురాలు ఫిర్యాదు

కలెక్టర్, ఎస్పీకి వృద్ధురాలు వినతి

నరసరావుపేట రూరల్‌: టీడీపీ నేతల ఆగడాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది. ఆ పార్టీ మహిళా నేత­లు సైతం భూ ఆక్రమణలు చేస్తూ రెచ్చిపోతున్నారు. పల్నా­డు జిల్లాలో సోమవారం ఓ వృద్ధురాలు ఫిర్యా­దు­తో వెలుగుచూసిన ఘటనే ఇందుకు ఉదాహరణ. వివరాలివీ.. ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని టీడీపీ మహిళా నాయకురాలు ఒకరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తోందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని పల్నా­డు జిల్లా అచ్చంపేట గ్రామానికి చెందిన వృద్ధురా­లు బత్తుల రోశమ్మ (70) ఎస్పీ కె. శ్రీనివాసరావుకు సో­మ­వారం ఫిర్యాదు చేసింది.

తనకు రాష్ట్ర ప్రభు­త్వం 2006­లో నిరుపేదల కోటా కింద 1.50 ఎకరాల పట్టా భూమిని ఇచ్చిందని.. ఈ భూమి పక్కనే టీడీపీ మహిళ నాయకురాలు చల్లా అనువకళ భూమి కూడా ఉందని ఆమె చెప్పింది. అయితే, తన భర్త అనారోగ్యంతో చనిపోవడం.. ఇద్దరు కుమార్తెలకు వివాహం కావడం.. కుమా­రుడికి మతిస్థిమితం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని తన భూమిని ఆక్రమించుకునేందుకు ఓ పత్రి­కా విలేకరి సాయంతో అనువకళ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వేధించడం ప్రారంభించిందని.. భూమిలోకి వస్తే చంపుతామని కూడా బెదిరించిందని ఆమె తన ఫిర్యా­దులో పేర్కొంది.

అంతేగాక.. జూలై 30న అనువకళ, మరికొందరు కలిసి తనపై దాడిచేశారని.. కాలు విరి­గి తీవ్రంగా గాయపడడంతో తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రోశమ్మ వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపుతామంటూ పదిరోజులుగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కుమార్తె రమాదేవి, మనవడు సాయిరాం సాయంతో రోశమ్మ సోమవారం అంబులెన్స్‌లో జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేసింది. అనువకళతో పాటు ఆమెకు సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తనను కాపాడాలని ఎస్పీని కోరింది. అనంతరం జిల్లా కలెక్టర్‌కు కూడా అర్జీని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement