సాక్షి, శ్రీకాకుళం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ప్రైవేటీకరణ ఆపాలని కొన్ని రోజులుగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ప్రజాసంపదను దోచుకుంటున్నారంటూ చంద్రబాబు సర్కార్ను ఆయన నిలదీశారు. 16 నెలల కాలంలోనే 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇలాంటి పరిపాలన దేశంలో మరెక్కడా ఉండదు’’ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఐదేళ్లలో 3 లక్షల 30 వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా?. 16 నెలల కాలంలో 2 లక్షల 50 వేల కోట్లకు పైగా అప్పు చేయడం విధ్వంసమా?. ఏది విధ్వంసం చంద్రబాబు..?. నాడు-నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం విధ్వంసమా?. నాడు బాబు పాలనలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లు విధ్వంసమా?’’ అంటూ అప్పలరాజు దుయ్యబట్టారు.


