
ఏఎంసీ చైర్పర్సన్ ప్రమాణస్వీకారోత్సవం
సత్తెనపల్లి: నియోజకవర్గంలో పలు అభివద్ధి పనుల ప్రారంభోత్సవం, విగ్రహల ఆవిష్కరణకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం సత్తెనపల్లి చేరుకున్నారు. తొలుత సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామంలో నూతన సచివాలయ భవనం, ఆర్బీకే బిల్డింగ్, నూతన సీసీ రోడ్, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, సాలీడ్ వేస్ట్ మేనేజెమెంట్ షెడ్లను ప్రారంభించారు. అనంతరం సత్తెనపల్లి చేరుకొని పట్టణంలోని 21వ వార్డులో స్వర్గీయ నందమూరి తారకరామారావు, గుంటూరు–మాచర్ల ప్రధాన రహదారిలోని తాలూకా సెంటర్లో డివైడర్పై నూతనంగా నిర్మించిన స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా కోమటినేని శోభారాణి, పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాలలో రాష్ట్ర చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, డాక్టర్ కోడెల శివరామ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.